మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఉద్యోగ సంఘాల నేతల బెదిరింపులకు భయపడం.హెచ్చరికలతో వారికే నష్టం: సజ్జల

ఉద్యోగ సంఘాల నేతల  బెదిరింపులకు భయపడబోమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు చేస్తున్న రాజకీయ ప్రకటనలు సరికావన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఉద్యోగుల పట్ల బాధ్యత కంటే, వారికి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. హెచ్చరికలు చేయడం వల్ల తాము వెనక్కుతగ్గమని, అలాగే ముందుకూ వెళ్లమని సజ్జల స్సష్టం చేశారు. ఇలాంటి హెచ్చరికలతో వారికే నష్టమని ఉద్యోగ సంఘాల నేతలను హెచ్చరించారు. వారం రోజుల్లో పీఆర్‌సీ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నానని చెప్పారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్‌సీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హమీల అమలును రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని, నెలరోజుల్లోనే అధ్యయనం పూర్తవుతుందని చెప్పారు. ఓటీఎస్‌ పూర్తిగా స్వచ్ఛందమని స్పష్టం చేశారు

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go