మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

పాఠం చెబుతుండగా గుండెపోటు కుర్చీలోనే కన్నుమూసిన ఉపాధ్యాయుడు

 ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తున్నారు... పిల్లలంతా ఆసక్తిగా, శ్రద్ధగా వింటున్నారు... అంతలో ఒక్కసారిగా పాఠం ఆగింది... ఉపాధ్యాయుడు గుండెపోటుతో కూర్చున్న కుర్చీలోనే ఒరిగిపోయారు. ఈ హృదయ విదారక ఘటన బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో చోటుచేసుకుంది. ఎ.వి.బాబు(45) మూడేళ్లుగా వాకావారిపాలెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం పిల్లలకు తరగతి గదిలో పాఠం చెబుతుండగా గుండెపోటుకు గురై కూర్చున్న కుర్చీలోనే ప్రాణాలు వదిలారు. నిశ్చేష్టులైన విద్యార్థులు విషయాన్ని ఇతర ఉపాధ్యాయులకు చెప్పారు. పాఠశాల పక్కన ఉన్న ఆరోగ్య ఉపకేంద్రం వైద్యసిబ్బంది చేరుకుని ఎ.వి.బాబును పరీక్షించారు. మరోపక్క 108కి సమాచారం అందించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు సిబ్బంది నిర్ధరించారు. ఎ.వి.బాబు స్వగ్రామం జె.పంగులూరు. 2002లో ఉపాధ్యాయుడిగా చేరారు. భార్య రాజామణి కొండమంజులూరులో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఉపాధ్యాయుడు తమ కళ్లముందే చనిపోవడంతో విద్యార్థులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go