మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు.. వారిని ప్రతిపక్షం రెచ్చగొడుతోంది: సీఎం జగన్‌

ఉపాధ్యాయులను రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని.. దానికి ఎల్లో మీడియా వత్తాసు పలుకుతోందని ఏపీ ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. ఇతర రాష్ట్రాల కంటే మెరుగ్గా ఉండేలా విద్యా వ్యవస్థలో మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. పేదలు కూడా మంచి చదువులు చదవాలనేదే తమ లక్ష్యమని అన్నారు. విజయవాడలో ప్రభుత్వం నిర్వహించిన గురుపూజోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యాయులు కూడా తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. 


ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే ఉద్దేశం తమకు లేదని జగన్ అన్నారు. ఎవరూ అడగకుండానే ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచామని చెప్పారు. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులను కల్పించామని తెలిపారు. విద్యాశాఖపైనే తాను ఎక్కువ సమీక్షలను నిర్వహించానని చెప్పారు. విద్యార్థులను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఉపాధ్యాయులదేనని అన్నారు. సాన పట్టకపోతే వజ్రం కూడా రాయితోనే సమానమని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థలో అనేక చర్యలను చేపట్టామని అన్నారు. నాణ్యమైన చదువులు అందరికీ అందుబాటులోకి రావాలని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న చర్యలు పేదలకు విద్యను దూరం చేశాయని అన్నారు

No comments:

Post a Comment

LATEST POST

School complex agenda

ఈ రోజు నిర్వహించే క్లస్టర్ కాంప్లెక్ సమావేశం యొక్క సెషన్స్ వారీగా నిర్వహించవలసిన కార్యక్రమాలు, చివరలో సబ్మిట్ చేయవలసిన ఫీడ్ బ్యాక్ ఫామ్ Clus...