మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఉద్యోగ సంఘాలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన: సజ్జల

రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి, సీఎస్‌ ఈరోజు ఆయా సంఘాలతో మరోసారి సమావేశవుతారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

సీఎంతో ఉద్యోగ సంఘాల సమావేశం ఈరోజు ఉండదని చెప్పారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలసి సీఎం జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు.

నిన్న ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలతో పాటు ఉద్యోగులకు ఎంత మేర పీఆర్సీ ఇవ్వాలనే దానిపై సీఎంతో చర్చించామన్నారు.

ప్రస్తుతం ఉద్యోగులకు 27శాతం ఐఆర్‌ ఇస్తున్నామని.. గ్రాస్‌ వేతనం తగ్గకుండా చర్యలు తీసుకుంటామని సజ్జల చెప్పారు.

 ఉద్యోగుల మిగిలిన డిమాండ్లపైనా చర్చించామని.. అన్నింటినీ క్రమంగా పరిష్కరిస్తామన్నారు.

 కరోనా పరిస్థితుల వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగాలేదని చెప్పారు.

 ఉద్యోగులకు ఇప్పుడిస్తున్న ఐఆర్‌ 27 శాతం కంటే ఎక్కువగానే లబ్ధి చేకూరేలా ప్రభుత్వ నిర్ణయం ఉంటుందన్నారు. 

రేపటికి పీఆర్సీపై చర్చల ప్రక్రియ పూర్తికావొచ్చని సజ్జల తెలిపారు.

రేపు లేదా సోమవారం ఉద్యోగ సంఘాలతో సీఎం చర్చలు ఉండొచ్చని.. సంఘాల నేతలు సీఎంను కలిసిన తర్వాతే పీఆర్సీపై ప్రకటన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go