రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కర ణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. కొందరు పనిగ ట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమాలు చేపడు తున్నారని విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయుల తో మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్య మాల్లో ఫొటోలు షేర్ చేస్తున్నారని తెలి పారు. ఇలాంటి దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని, ప్రజలకు వాస్తవాలు తెలుసు నని సోమవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పాఠశాలల్లోని మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు 'అమ్మ ఒడి' కింద ఇచ్చే నగదు నుంచి రూ. వెయ్యిచొప్పున ఇచ్చిన దాదాపు 444. 89 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తం 45,716 పాఠశాలల్లో ఇప్పటికే ఆయాలను నియమించామని వివరించారు. 300 మంది విద్యార్థులున్న పాఠశాలల్లో ఒకరు, 600 మంది ఉన్న పాఠశాలల్లో ఇద్దరు, 900 మంది ఉన్న పాఠశాలల్లో ముగ్గురు, 900 పైబడి విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో నలుగురిని చొప్పున ఆయాలను నియమించడం జరిగిందని తెలిపారు. ఆయాలకు నెలకు రూ. ఆరు వేల జీతం చెల్లిస్తున్నా మన్నారు. మరుగుదొడ్ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కెమికల్ కిట్లను కూడా సరఫరా చేశామని వివరించారు. మరుగుదొడ్ల పరిశుభ్రతపై గ్రామ సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ జరుగుతోందని, అయితే వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు చర్యలకు దిగుతున్నారని మంత్రి డా. సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
Pages
మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.
Subscribe to:
Post Comments (Atom)
LATEST POST
Contributory Pension Scheme (CPS) – One-time option for coverage under Old Pension Scheme (OPS) to eligible employees whose recruitment notification/advertisement was issued prior to 01.09.2004 but who joined Government service on or after 01.09.2004 - Orders
2003 కు ముందు నోటిఫికేషన్ వచ్చి 2004 తరువాత ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ వర్తింప జేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు. Click Here To Do...
No comments:
Post a Comment