మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

మాస్క్‌లు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ఏడోసారి ప్రసంగం

 
కరోనాతో భారత్ పోరాటం చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని తెలిపారు. మరణాల రేటు తక్కువగా ఉందని పేర్కొన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. 

కరోనా కట్టడే లక్ష్యంగా విధించిన జనతా కర్ఫ్యూ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన జాతినుద్దేశించి చేసిన ప్రసంగాల్లో ఇది ఏడోది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. కరోనా టెస్టింగ్‌ కోసం 2వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని మోదీ చెప్పారు. ప్రతి 10లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకిందన్నారు. అదే అమెరికా, బ్రెజిల్‌ లాంటి దేశాల్లో అయితే 10 లక్షల మందిలో 25వేల మందికి సోకిందని పేర్కొన్నారు.

పండుగల సీజన్‌ సమీపిస్తున్న వేళ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మోదీ కీలక సూచనలు చేశారు. ‘‘త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుంది. పరీక్షల సంఖ్య పెంచడంలో వైద్య వ్యవస్థ అత్యంత వేగంగా పనిచేసింది. వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేశారు. కరోనా తగ్గుముఖం పట్టిందని నిర్లక్ష్యంగా ఉండొద్దు. కరోనా దేశం నుంచి విడిచిపోయిందనే భావన రానీయొద్దు. 

కరోనా తగ్గిందని భావిస్తే తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. కరోనా పోయిందని మాస్కులు ధరించకపోతే ప్రమాదంలో పడినట్టే. యూరప్‌, అమెరికా పరిణామాలు చూస్తే నిర్లక్ష్యం కూడా ప్రమాదకరంగా మారొచ్చు’’ అని అన్నారు.

No comments:

Post a Comment

LATEST POST

Declaration of General Holiday on the Occasion of Eid-Ul-Fitr (Ramzan) on 21.03.2026* *(Saturday) instead of 20.03.2026 (Friday)

రంజాన్ సెలవు దినాన్ని 20-03-2026 నుండి 21-03-2026 కు మార్పు చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సాధారణ పరిపాలన శాఖ.  Click Here to download go