Pages

మీకు కావలసిన సమాచారం కోసం ఇక్కడ టైప్ చేసి సెర్చ్ చేయగలరు.

🙏లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా నెం 9866371525 ను మీ వాట్సాప్ గ్రూప్ లో ADD చేయగలరు 🙏⚡ప్లాష్..ప్లాష్..⚡ PAY SLIPS ; IT SOFTWARE 2022-23 ; SALARY CERTIFICATE ⚡న్యూస్ పేపర్స్ ⚡ ఈనాడు ; సాక్షి ; ఆంధ్రజ్యోతి ; ఆంధ్రభూమి ; లైవ్ న్యూస్ చానెల్స్

ఉదయం తొమ్మిదినుంచే బ్యాంకులు ఒంటి గంట వరకులావాదేవీలు

పాక్షిక లాక్ డౌన్ నేపథ్యంలో బ్యాంకులుకూడా తమ పనివేళ్లలో మార్పులు చేసుకుంటున్నాయి. గురువారం నుంచి కొత్త వేళలు అమలులోకి వస్తాయి. ఉదయం తొమ్మిది గంటలకే బ్యాంకు లావాదేవీలు ప్రారంభమై మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగుతాయి. కరోనా కారణంగా కొద్ది రోజులుగా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు పనిచేసిన బ్యాంకులు నేటి నుంచి ఒక గంట ముందుగానే తెరుచుకోనున్నాయి.

 కరోనా ఉధృతి కారణంగా గురువారం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే వ్యాపార లావాదేవీలకు అనుమతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత అన్నీ మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగానే బ్యాంకులు కూడా త్వరగా తెరిచి ఒంటి గంటకు లావాదేవీలు పూర్తి చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు అన్ని శాఖలకు సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

No comments:

Post a Comment

LATEST POST

NMMS 2026 notification released Rc.No.208/NMMS/2026 dt: 10-09-2026

రాష్ట్రవ్యాప్తంగా 8వ తరగతి విద్యార్థుల కోసం నేషనల్ మీన్స్-కమ్-మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్ (NMMS) పరీక్షను 15-11-2026 (ఆదివారం) ఉదయం 10.00 గంట...